ఆదివారం నాడు అమ్మకు సారె సమర్పించనున్న భక్తజనం
>> Thursday, July 6, 2017
అఖిలలోకాలకు జనని జగన్మాత కనకదుర్గ . ఆతల్లి తానే పలురూపాలుగా వెలసి తన సంతానాన్ని ప్రేమతో పోషించి పాలిస్తున్నది. ప్రేమభక్తితో ఆతల్లిని,అమ్మగా ఆడపడుచుగా పెద్దముత్తైదువుగా భావించి భక్తులు సేవిస్తుంటారు.
ఆషాఢ మాసంలో అమ్మను తమ ఆడపడుచుగా భావించి సారె సమర్పించే సాంప్రదాయం ఉన్నది. . ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో వచ్ఛే ఆదివారం [తొమ్మిది- జులై] రోజున అమ్మకు సారె సమర్పించేందుకు భక్తులు సన్నద్ద్దమవుతున్నారు . చీరె సారెలతో తరలివచ్ఛే భక్తులకు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి వారి సారెను అమ్మకు సమర్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి . అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదాలు అందజేయటం జరుగుతుంది . అందులోనూ ఆరోజు గురుపౌర్ణమి కావటం విశేషం . ఈసందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు కుంకుమార్చనలు జరుపబడతాయి , సారె సమర్పించదలచుకున్న భక్తులు భార్యాభర్తలు ఇద్దరు సాంప్రదాయ వస్త్రాలు ధరించి రావలసిఉంటుంది . ఇతరవివరాలకై 9948235641 లో సంప్రదించ వచ్చు
0 వ్యాఖ్యలు:
Post a Comment