జయము జయము భరతమమాత ! జయమునీకు జగన్మాత
>> Saturday, April 21, 2012
ప్రియ భారత సహోదరులారా !
నిన్న భారతదేశచరిత్రలో
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ శుభదినం. ఇండియా అగ్ని-5 అనే ఒక అత్యంత
శక్తిమంతమైన ICBM (Inter-Continental Ballistic Missile) ని పరీక్షగా
ప్రయోగించి చూసింది. ఈ దెబ్బతో వ్యూహాత్మకంగా USA, UK, చైనా, ఫ్రాన్సు
దేశాల కోవలోకి ఇండియా కూడా చేఱిపోయింది. దీని రేంజి 5,000 కిలోమీటర్లు
మాత్రమేనని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అసలు రేంజి 8 లేదా 9 వేల
కిలోమీటర్లకి తగ్గదని ప్రపంచదేశాలు అనుమానిస్తున్నాయి. నిజానికి ఇలాంటి
వ్యూహాత్మక విషయాల్లో పత్రికలలో వచ్చే వార్తాకథనాల వెనక ఇంకా చెప్పబడని
అసలుకథ చాలా ఉంటుంది. అంటే ఈ తరహా క్షిపణులతో యావత్తు ఆసియా, యూరప్,
ఉత్తరాఫ్రికాలలోని అన్ని శత్రుదేశాల్నీ చుట్టబెట్టే పోరాట పటిమని ఇండియా
సాధించిందన్నమాట. ఈ వార్తతో ఇప్పటికే చైనా గుండెల్లో రైళ్ళు
పరిగెడుతున్నాయి. అయినా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఈ
క్షిపణిప్రయోగం గుఱించి అమెరికా ఒకపక్క లోలోపల ఏడుస్తోంది. కానీ ఇంకో పక్క
సంతోషిస్తోంది, చైనాకి ఒక ప్రాంతీయ సవాల్ ఏర్పడిందని !
[ఎప్పుడు కూడా బలవంతుడే గౌరవింప బడతాడు . దేశానికి బలవంతులు కావాలి . దేశం సమున్నతమై వెలగాలని కోరుకునే పౌరులు కావాలి . అటువంటి పౌరులద్వారానే మాతృభూమి మన్ననలు పొందుతుంది అంతేకాని ఇక్కడ తిండి తింటూ అక్కడి పాటలు పాడేవాళ్ళు కాదు . రంగు నీళ్ళ కంపెనీలకు పొరుగుదేశాల ఏజంట్లుగా మారి భారత దేశాన్ని బలహీనపరుస్తున్న కుహనమేధావుల కుతర్కాలతో కాదు ] జేజేలు పలకండి మనశాస్త్రవేత్తలకు .
0 వ్యాఖ్యలు:
Post a Comment